Home Page SliderNational

దేశంలో మళ్లీ  10 వేలు దాటిన కరోనా కొత్త కేసులు

Share with

కరోనా మహమ్మారి ఇప్పుడప్పుడే మన దేశాన్ని విడిచి వెళ్లేలా లేదు.  కాగా దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది.  ఈ నేపథ్యంలో ఇవాళ దేశంలో కరోనా కేసులు మరోసారి గణనీయంగా పెరిగాయి. గడచిన 24 గంటల్లో దేశంలో 10,542 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 63,562కు చేరింది. అయితే గత 24 గంటల్లో వైరస్ నుంచి 8,175 మంది కోలుకోగా..చికిత్స పొందుతూ 27 మంది ప్రాణాలు విడిచారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ మేరకు ఇవాళ ఏపీలో కొత్తగా 90 మంది కరోనా బారినపడ్డారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 390కి చేరింది.