ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు..రాహుల్ సంచలన వ్యాఖ్యలు
కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎన్డీయే కూటమిలోని కొందరు నేతలలో తీవ్ర అసంతృప్తి ఉందని, వారు ఇండియా కూటమితో టచ్లో ఉన్నారని ఒక ఇంటర్యూలో వ్యాఖ్యానించారు. మోదీ కూటమి బలహీనంగా ఉందని, వారు విద్వేషాలను వ్యాప్తి చేశారని, అందుకే ఆ ఆలోచనను ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. మా చేతులు కట్టేసిన పరిస్థితుల్లో కూడా పోరాడాం అని వివక్ష లేని పరిస్థితులు ఉంటే తప్పకుండా ఇండియా కూటమి అధికారాన్ని సాధించి ఉండేదని అభిప్రాయపడ్డారు. గత రెండు ఎన్నికలలో మెజార్టీ సాధించిన ప్రభుత్వం ఈసారి కూటమి పక్షాలపై ఆధారపడవలసిన పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.