Home Page SliderNational

లోక్‌సభలో తెలుగులో ప్రమాణం చేసిన మంత్రులు

Share with

కొత్త లోక్‌సభ నేడు ప్రారంభమయ్యింది. లోక్‌సభ ఎన్నికలలో గెలుపొందిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తెలుగు ఎంపీలు కొందరు తెలుగులో ప్రమాణ స్వీకారం చేసి ఆశ్చర్యపరిచారు. తెలుగు రాష్ట్రాల కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు అచ్చ తెలుగులో తమ ప్రమాణ స్వీకారాన్ని చేశారు. కిషన్ రెడ్డి తెలుగు సంప్రదాయ పంచకట్టు, తెలుపు చొక్కాతో సభలో ప్రవేశించారు. కొందరు ఎంపీలు హిందీలో, ఇంగ్లీషులో వారి ప్రమాణ స్వీకారాలను చేశారు.