Home Page SliderNational

సాయంత్రం 4 గంటలకు లోక్‌సభలో ప్రసంగించనున్న  మోదీ

Share with

ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈ రోజు సాయంత్రం 4 గంటలకు లోక్‌సభలో మాట్లాడనున్నారు. అయితే నిన్న జరిగిన లోక్‌సభ సమావేశాల్లో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు మోదీ తన ప్రసంగంలో రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం ప్రధాని ఎన్డీయే నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మోదీ సభలో వ్యవహరించాల్సిన తీరుపై సభ్యులకు పలు సూచనలు చేశారు.