Home Page SliderInternational

మోడీ ప్రమాణ స్వీకారానికి మాల్దీవుల అధ్యక్షుడు

Share with

భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఈ ప్రమాణ స్వీకారానికి పలువురు విదేశీ అతిధులు హాజరుకానున్నారు. అయితే వారిలో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.మయుజ్జుతోపాటు శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్‌సింఘే,బంగ్లా ప్రధాని షేక్ హసీనా,మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్,నేపాల్ ప్రధాని పుష్పకమల్ ప్రచండ,భూటాన్ ప్రధాని సెరింగ్ టోబ్గే ,సీషెల్స్ వైస్‌ప్రెసిడెంట్ అహ్మద్ అఫీఫ్ తదితరులు ఉన్నారు. అయితే వీరిలో కొంతమంది ఇప్పటికే ఇండియాకు చేరుకున్నట్లు సమాచారం. కాగా రేపు 7.15 గంటలకు మోడీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.