Home Page SliderNational

ఉజ్వల వినియోగదారులకు మోదీ సర్కార్ శుభవార్త

Share with

గ్యాస్ వినియోగదారులకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలియజేశారు. మోదీ సర్కార్ రాఖీ పండుగ సందర్భంగా మహిళల కోసం ఉజ్వల గ్యాస్ సిలిండర్‌ ధరలో రాయితీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరింత రాయితీని అందిస్తూ 300 రూపాయల రాయితీని అందించాలని నిర్ణయించుకున్నారని మంత్రి తెలియజేశారు. అంతేకాక కేంద్రం తెలంగాణ అభివృద్ధి కోసం గిరిజన యూనివర్సిటీని, పసుపు రైతుల సంక్షేమం కోసం పసుపు బోర్డును ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.