Andhra PradeshHome Page Slider

ఏపీలో రేపు కూటమి పార్టీల ఎమ్మేల్యేల సమావేశం

Share with

ఏపీలో కూటమి ప్రభుత్వం స్థాపించడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రేపు ఏపీలో కూటమి ఎమ్మేల్యేల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. కాగా ఎల్లుండి చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలోని కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన శరవేగంగా జరుగుతున్నాయి.అయితే ఏపీ క్యాబినేట్ ఏర్పాటు చేయడంలో ఈ సమావేశం కీలకంగా మారనుంది.కాగా  ఎల్లుండి చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శించుకుంటారని సమాచారం.