Home Page SliderTelangana

కాంగ్రెస్ ఎంపీల ఇళ్లపై ఐటీ దాడులు చేయాలన్న ఎమ్మెల్యే ధన్‌పాల్

Share with

నిజామాబాద్: కాంగ్రెస్ ఎంపీల ఇళ్లపై ఐటీ దాడులు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు ఇంట్లో ఆదాయపు పన్ను అధికారులు ఐదు రోజులుగా సోదాలు చేయగా ఇప్పటికే రూ.350 కోట్లు దొరికాయన్నారు. 90 మంది అధికారులు, డబ్బులు లెక్కించే యంత్రాలు 40 ఉపయోగించినా లెక్కతేలడం లేదన్నారు. ఓడిపోయిన ఎంపీగా, రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి కాంగ్రెస్ పెంచి పోషిస్తోందని ఆరోపించారు.