Home Page SliderTelangana

మేడిగడ్డ బ్యారెజ్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపాటు.. సందర్శనకు ఏర్పాట్లు

Share with

మేడిగడ్డ బ్యారెజ్‌ కుంగడంపై ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారెజ్ సందర్శనకు ఏర్పాట్లు చేయాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. పిల్లర్ కుంగడమనేది చాలా తీవ్రమైన అంశమని పేర్కొన్నారు. జలసౌధలో తొలిసారిగా నీటి పారుదల శాఖ అధికారులతో భేటీ అయి, సమీక్ష నిర్వహించారు మంత్రి. ఈ సమీక్షలో భాగంగా అధికారులు మంత్రికి వివరణలు ఇచ్చారు. పిల్లర్ కుంగిన వ్యవహారంపై మాట్లాడుతూ ఒక పిల్లర్ 1.2 మీటర్లు కుంగడంతో, మరో మూడు పిల్లర్లపై కూడా దాని ప్రభావం పడిందన్నారు. వెంటనే ప్రాజెక్టులలోని నీటిని తోడించడంతో కుంగడం తగ్గిందని పేర్కొన్నారు.