Andhra PradeshHome Page Slider

ప్రజాదర్బార్ కొనసాగుతుందన్న మంత్రి నారా లోకేష్

Share with

ఏపీలో ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. నిన్న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం,డిప్యూటీ సీఎం,మంత్రులతోపాటు ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేశారు. నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సీఎంతోపాటు పలువురు మంత్రులు,ఎమ్మెల్యేలు స్పీకర్‌కు అభినందనలు తెలిపి గతంలో జరిగిన పలు అంశాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం అసెంబ్లీ లాబీలో పలువురు మంత్రులు మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రజా దర్బార్ కొనసాగుతుందన్నారు. కాగా ప్రజా దర్బార్‌లో అనేక సమస్యలు తన దృష్టికి వస్తున్నాయన్నారు.అయితే సమస్యలు చెప్పుకోవాలనుకునేవారికి ఇది ఒక వేదిక అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.