అధికారులపై మంత్రి కొండా సురేఖ సీరియస్
తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగకు సంబంధించిన మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులపై సీరియస్ అయ్యారు. మీటింగ్కు హాజరుకాని అధికారులకు మెమో ఇష్యూ చేయాలని తెలిపారు. మంత్రులు, మేయర్ వచ్చినా అధికారులు రారా అని మండిపడ్డారు. అలాగే, పండుగ నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.