Home Page SliderTelangana

అధికారులపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్

Share with

టిజి: సెక్రటేరియట్ ఉద్యోగులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్ అయ్యారు. రోడ్లు, భవనాల శాఖ కార్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉదయం 11 గంటలు దాటినా సిబ్బందిలో కొందరు ఆఫీసుకు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అటెండెన్స్ బుక్‌ను పరిశీలించారు. ప్రతీ ఒక్కరు విధిగా సమయానికి డ్యూటీకి రావాలని ఆదేశించారు.