Home Page SliderTelangana

“గత ప్రభుత్వ తప్పుల్లో ఎంఐఎం బాధ్యత కూడా ఉంది”:సీఎం రేవంత్ రెడ్డి

Share with

తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు వాడీ-వేడీగా కొనసాగుతున్నాయి.కాగా ఇవాల్టి సభలో అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డారు. అయితే ఇటీవల అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేత పత్రంపై ఈ రోజు జరిగిన చర్చ రసాభాసగా మారింది. కాగా సభలో ఎంఐఎం అక్బరుద్దీన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎంపై మండిపడ్డారు. తెలంగాణాలో షబ్బీర్ అలీని,అజారుద్దీన్‌ను ఓడించడానికి కూడా ఎంఐఎం పనిచేసిందన్నారు. మీరు ముస్లింలు అయినప్పటికీ సాటి ముస్లింలను ఓడించడానికి పని చేయలేదా అని సీఎం ఎంఐఎంను ప్రశ్నించారు. కాగా గత ప్రభుత్వ తప్పుల్లో ఎంఐఎం పాత్ర కూడా ఉందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు  గత ప్రభుత్వ తప్పులకు ఎంఐఎం కూడా బాధ్యత వహించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.