Home Page SliderInternational

పాకిస్తాన్‌లో భారీ పేలుడు.. 17 మంది మృతి

Share with

పాకిస్తాన్‌లోని ‘స్వాత్’ లోయలో భారీ పేలుడు సంభవించింది. అక్కడి ఉగ్రవాద నిరోధక కార్యాలయంలో భారీ పేలుడు జరిగింది. అక్కడి రూంలో ఉంచిన పేలుడు పదార్థాలే దీనికి కారణమని భావిస్తున్నారు. ఈ సంఘటనలో 17 మంది మరణించినట్లు సమాచారం. దీనిలో 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో పోలీసులు కూడా ఉన్నారు. ఈ పేలుడు వల్ల ఆ భవనం కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనకు ఉగ్రవాదులు కారణం కాదని, ఇది ప్రమాదవశాత్తూ జరిగిందని అధికారులు తెలియజేశారు.