నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్
ఛత్తీస్ఘడ్ నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కాగా ఈ ఎన్కౌంటర్లో 11 మంది మావోయుస్టులు హతం అయినట్లు తెలుస్తోంది.కుర్రేవాయ్ అటవీ ప్రాంతంలో పోలీసులు,మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం దండకారణ్యంలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా 1400 మంది భద్రతాబలగాలు అక్కడ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.