ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 8 మంది నక్సల్స్ మృతి
ఛత్తీస్గఢ్లోని అబుజ్మడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది నక్సల్స్ హతమయ్యారు. ఈ కాల్పుల్లో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. నారాయణ్పూర్, కాంకేర్, దంతేవాడ, కొండగావ్ జిల్లాలకు చెందిన జవాన్లు సంయుక్తంగా ఈ యాంటీ నక్సల్స్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.