Home Page SliderNational

కాంగ్రెస్ గెలుపులో మ్యానిఫెస్టోనే కీలకమా?

Share with

కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి కన్నడ ప్రజలు ఈ ఎన్నికల్లో పెద్ద షాక్ ఇచ్చి..కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో ఇంతటి ఘనవిజయానికి కారణం ఏంటని నెట్టింట ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది. అయితే చాలామంది కాంగ్రెస్ విజయానికి కారణం వారు ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోనే అని అభిప్రాయపడుతున్నారు. కాగా కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని పేర్కొంది. అంతేకాకుండా గృహలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2000 అందిచనున్నట్లు తెలిపింది. అన్న భాగ్య పథకం ద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 10 కేజీల బియ్యం ఇవ్వనున్నట్లు మ్యానిఫెస్టోలో వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించింది.యువనిధి పథకం రూ.1500.మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వంటివి కీలకంగా ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కూడా కర్ణాటక ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిదనే చెప్పాలి.