Home Page SliderTelangana

జమ్మికుంటలో దళితుల ఆత్మీయ సమ్మేళనంలో మంద కృష్ణ మాదిగ, ఈటల రాజేందర్

Share with

కరీంనగర్: జమ్మికుంటలో దళితుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి హాజరైన మంద కృష్ణ మాదిగ, ఈటల రాజేందర్.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ: ముప్పై ఏళ్లుగా జాతికి జీవితం అంకితం చేసి పట్టువదలని విక్రమార్కుడు లాగా ఎ బి సి డీ వర్గీకరణ కోసం కొట్లాడుతున్న వ్యక్తి మందకృష్ణ. పేదల సమస్యలపై పోరాడుతున్న వ్యక్తి. చంపినా పర్లేదు కానీ ఈటల రాజేందర్‌తో ఉంటా అని చాలామంది ఉప ఎన్నికల్లో నన్ను గెలిపించారు.

కెసిఆర్‌ను బొందపెట్టకపోతే రాజకీయం బ్రతకదు అని ఆయన్ను ఓడించడానికి సిద్ధం అయ్యాను. కెసిఆర్ రాజకీయాలను బ్రష్టుపట్టించారు. హుజూరాబాద్ brs అభ్యర్ధి నన్ను గెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని బ్లాక్‌మెయిల్ చేసే చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. నన్ను మొక్కలా పెంచుకున్నారు. నేను మీ ఒడిలో పెరిగినవాణ్ణి. కెసిఆర్ నిజాం సర్కార్ కంటే ఎక్కువ వేధిస్తున్నారు. మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఒకణ్ణి ఇక్కడ పెట్టారు. తెలంగాణ గడ్డమీద కెసిఆర్‌ను బొందపెడితేనే మీ బిడ్డ పెద్ద లీడర్ అవుతారు. ఢిల్లీకి రాజు అయిన తల్లికి కొడుకే.. నేను మీ ఎమ్మెల్యేను. మీ చరిత్ర లేకుండా నా చరిత్ర లేదు. ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని గొప్ప తెలంగాణ అందిస్తాం. శిరస్సు వంచి కోరుతున్నా నేను మీ బిడ్డను. సంపూర్ణంగా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నా..

మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ:

కులాలకు, మతాలకు అతీతంగా ఈటల రాజేందర్‌ను గెలిపించండి పెద్ద పదవి అందుకుంటారు. మీరు గెలిపిస్తే మీ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా పెంచిన వారౌతారు. నాకు ఈటల రాజేందర్ గారికి 40 ఏళ్ళ అనుబంధం ఉంది. రాజేందర్ అన్న కోళ్ల ఫాంలో కోళ్ల ఎరువు ఎత్తే కూలి పని నేను చేసినప్పటి నుండి పరిచయం. మేము పేదల కష్టాలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటాము. పేదలందరికీ ఉచిత వైద్యం అందిచడానికి నేను రాజేందర్ అన్న ముందుంటాం. మేము చేసిన ప్రతి పోరాటంలో ఈటల రాజేందర్ మాకు అండగా ఉన్నారు. మరి వేరే వాళ్ళకు ఎందుకు ఓటు వెయ్యాలి అనే ఆలోచన చేయండి. మేము పేదరికం అనుభవించి వచ్చిన వాళ్ళం. మాకు పేదల ఆకలి బాధలు తెలుసు. రేపు ఆకలి తీర్చేది మాలాంటి వారే.. నాకు పదవులు ఇస్తా అన్నా అన్నీ వదిలిపెట్టి ముప్పై ఏళ్లుగా నాజాతి కోసం పోరాడుతున్న. వర్గీకరణ జరిగితేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. వర్గీకరణ చేస్తాం అని కాంగ్రెస్ మోసం చేసింది. అలాంటి కాంగ్రెస్‌కి ఓటు వెయ్యవద్దు అనే.. నో కాంగ్రెస్ అని పిలుపునిచ్చా.. కెసిఆర్‌కు నిమ్మరసం ఇచ్చి ఆమరణదీక్ష విరమింపజేసిన మన జాతిని మోసం జేశారు. దళిత ముఖ్యమంత్రి, మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇస్తాం అని మోసం చేశారు. A B C D కోసం ఢిల్లీకి పోయి వస్తా అన్న కెసిఆర్‌కి 6 సంవత్సరాలు అయినా ఆ ఊసే ఎత్తడం లేదు. ఇవన్నీ అడిగి ధర్నా చేస్తే నన్ను అరెస్ట్ చేసి నెలరోజులు జైల్లో పెట్టారు. మందకృష్ణను నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసినం.. అణచివేస్తా అని కెసిఆర్ చెప్పాడు. అలాంటి వాడికి మద్దతు ఇద్దామా. మనం ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే కెసిఆర్ ఓడిపోవాలి.

కెసిఆర్ కామారెడ్డిలో ఒక బీసీ బిడ్డ గంపగోవర్ధన్ సీటు లాక్కున్నాడు. ప్రగతి భవన్ దొరల భవన్ అయ్యింది. రాజేందర్ అన్నను గెలిపిస్తే దానిని ప్రజా భవన్ చేస్తారు. మోదీ sc వర్గీకరణ చేస్తా అన్నారు. మీ పెద్దన్నను అని చెప్పారు. ఆ పెద్దన్నకు అండగా ఈ చిన్నన్నని గెలిపిద్దాం. బీసీలకు 67 ఏళ్ల తరువాత గొప్ప అవకాశం వచ్చింది. దేశంలో బీసీలు 52 శాతం మంది ఉన్నా ఒక్క బీసీ సీఎం కాలేదు. బీజేపీ ఒక బీసీని సీఎం చేస్తా అన్నది. అన్ని పార్టీల బీసీల్లారా ఈ అవకాశం జారవిడుచుకోవద్దు. మిగతా కులాల ప్రజలారా.. ఇన్నాళ్ళు బీసీలు ఓటు వేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేశారు కదా. ఒక్కసారి BC ముఖ్యమంత్రి చేయడానికి అవకాశం ఇవ్వండి. ఉద్యమ బిడ్డ, మీ బిడ్డ ఈటల రాజేందర్‌ను గెలిపించండి.