Home Page SliderTelangana

మంచిర్యాల: బీజేపీ అభ్యర్థి వీరబెల్లి రఘునాథ్ తరఫున ప్రచారంలో ఈటల

Share with

మంచిర్యాల: బీజేపీ అభ్యర్థి వీరబెల్లి రఘునాథ్ తరఫున ఎన్నికల ప్రచారంలో తెలంగాణ గుండెకాయ సింగరేణి. నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉంది.

ఒక లక్ష 24 కార్మికులతో కళ కళ లాడిన సింగరేణి కార్మికుల బ్రతుకుల్లో వెలుగు నింపలేక పోయారు. సింగరేణిలో కేసీఆర్ నాలుగు హామీలు ఇచ్చారు ఉద్యోగ అవకాశాల కోసం సింగరేణి, ఝార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్, ఆస్ట్రేలియాలో మైనింగ్ చేస్తామని చెప్పారు. కార్మికుల సంఖ్య పడిపోయింది. ఒకప్పుడు మట్టిపని మాత్రమే కాంట్రాక్టుకు ఇచ్చేవారు ఇప్పుడు మట్టిపని బొగ్గుపని మొత్తం ప్రైవేటుపరం చేశారు. కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతోంది.

సింగరేణి పరిధిలో ఉన్న పేద పిల్లలకు నౌకరీలు లేకుండా చేసిన దుర్మార్గుడు కేసీఆర్. సింగరేణిలో కార్మిక సంఘాలను తీసివేసి చైతన్యం చంపేశారు. సింగరేణి చచ్చుబడింది. సింగరేణికి ప్రభుత్వం పడ్డ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాను.  లేదంటే మంచిర్యాల, రామగుండం, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలలో ఒక్క ఓటు కూడా మీకు పడదు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే పది లక్షల రూపాయల లోపు వైద్యం ఉచితంగా అందిస్తాము. మీ పిల్లలకి ఉచితంగా నాణ్యమైన ఇంగ్లీష్ విద్య అందిస్తాము. మీ మీద ఫీజుల భారం పడనీయము. క్వింటాల్ వడ్లకి దేశంలో 2160 రూపాయలు మద్దతు ధర ఉంటే తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే రూ.3,100 మద్దతు ధర అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించాము. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత ధర లేదు. రైతులారా బిజెపిని ఆశీర్వదించండి. ఒక్క కిలో తరుగులేకుండా ధాన్యం సేకరణ చేస్తాం. ఆడబిడ్డలు మహిళా గ్రూపులలో ఉంటారు. వారికి 4,200 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల బాకీ పడ్డాడు కేసీఆర్. ఆడబిడ్డలను మోసం చేసిన వ్యక్తి కెసిఆర్. ఒక్క శాతం వడ్డీకే మహిళా రుణాలు అందిస్తామని  మేనిఫెస్టోలో ప్రకటించాము. నరేంద్ర మోడీ రైల్వే స్టేషన్‌లో ఛాయ్‌లు అమ్మారు.. ఆయన తల్లి నలుగురిళ్లలో పనిచేసుకుని వారిని పోషించింది. కష్టం తెలిసిన వారు కాబట్టి నరేంద్ర మోడీ గారు పేదల పక్షాన ఉన్నారు. ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందిస్తున్నారు. మీరు తింటున్న బియ్యం కేసీఆర్ ఇవ్వడం లేదు. నరేంద్ర మోడీ ఇస్తున్నారు. కెసిఆర్‌కి పెదాలమీద ప్రేమ లేదు అని అర్థమవుతోంది. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి, లేదంటే కేటీఆర్, లేదంటే హరీష్ రావు, లేదంటే కేటీఆర్ కొడుకు ముఖ్యమంత్రి అవుతారు తప్ప వేరే వారు ముఖ్యమంత్రి కాలేరు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పేరుకే అణగారిన వర్గాల పార్టీ అని చెప్తున్నారు. ఎస్సీల పట్ల, బీసీల పట్ల మీకు నిజాయితీ లేదు అని  నరేంద్ర మోడీ చెప్పారు.

నీలం సంజీవరెడ్డి నుంచి మొదలుపెట్టి కిరణ్ కుమార్ రెడ్డి వరకు అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే.. మళ్లీ వారే ముఖ్యమంత్రి అవుతారు తప్ప వేరేవారికి అవకాశం ఇవ్వరు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క బీసీకి కూడా ముఖ్యమంత్రి పదవి రాలేదు. అందని ద్రాక్ష అయింది. కాంగ్రెస్ టీఆర్ఎస్‌లో ఇవ్వరు. ఇస్తానని ధైర్యంగా చెప్పగలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. బీసీని ముఖ్యమంత్రి చేస్తాను అని ప్రకటిస్తే కొంతమంది ఓర్వలేక కళ్లమంట తనంతో బిజెపిని వదిలి పెడుతున్నారు. వెళ్ళిపోతున్న నాయకులారా బీసీలు అంటే మీకు అంతే అలుసా?  52 శాతం ఉన్నాం బిడ్డ.

మొన్న రాహుల్ గాంధీ రెండు శాతం ఓట్లు వచ్చే పార్టీ అని విమర్శిస్తున్నారు. రెండు శాతం కాదు బిడ్డా 52%. మా ఓట్లు మేమ వేసుకుంటే మీ అడ్రస్ గల్లంతవుతుంది. ప్రేమను పంచేవాడు, పిలిస్తే పలికేవాడు, ఆపదలో ఆదుకునే వాడు రఘునాధ రావు. ఆపదలో వచ్చిన వాని గొంతుక అవుతున్నారు. రఘునాథ్‌కి ఓటు వేయడం అంటే బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థికి ఓటు వేసినట్లే.. గొల్ల కురుమల్లారా. ముదిరాజుల్లారా.. నాయి బ్రాహ్మణులారా.. రజకుల్లారా..  పెరికలారా.. వడ్డెరలారా..

నిజంగా ఆకలి ఉన్నవారికి రాజ్యాధికారం రావాలని బీసీలకు సీట్లు ఇచ్చాము. 35 సీట్లు ఇచ్చాము.  కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలో ఇవ్వలేదు. వారం రోజుల్లోనే ఎన్నికలున్నాయి. ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు కమ్యూనికేట్ చేయండి బిజెపికి ఓటు వేయించండి. కృష్ణ మాదిగ నాయకత్వంలో 30 ఏళ్లుగా ఏ బి సి డి ల కోసం కొట్లాడుతున్నాడు. ఏ పార్టీ చేయలేదు. చేసేది బిజెపి పార్టీ మాత్రమే. రఘునందన్‌ని యాదికి పెట్టుకో ప్రజలని, శ్రమని, ధర్మాన్ని నమ్ముకో తప్పకుండా ఓట్లు వేస్తారు. హుజూరాబాద్ వాళ్లు చాలామంది ఇక్కడ ఉంటారు. వారందరూ బిజెపికి ఓటు వేయించండి. నా దగ్గరకు కూడా రండి. మీ ఓట్లకు పుట్టేది ఎమ్మెల్యే పదవి. రఘునాథ్ గుర్తు కమలం పువ్వు. బ్యాలెట్ బాక్స్‌లో  నాలుగో నెంబర్. రఘును గెలిపిస్తే నన్ను గెలిపించినట్లే.

రఘుకి ఓటు వేస్తే నాకు ఓటు వేసినట్టే. మీరు వేసే ఓటు ఇద్దరికీ ఉపయోగపడుతుంది. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి రఘును, నన్ను దీవించాలని కోరుకుంటున్నాను.

జై తెలంగాణ. భారత్ మాతాకి జై…