Home Page SliderInternational

మ్యాగీ ప్రియులు భారత్‌లోనే అధికం..నెస్లే ఇండియా

Share with

మ్యాగీ ప్రియులు భారత్‌లోనే అధికంగా ఉన్నారని మ్యాగీ తయారీదారు నెస్లే ఇండియా తేల్చి చెప్పింది. ప్రపంచ దేశాలన్నింటి కంటే భారత్‌లోనే వీటి అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. మ్యాగీ నూడుల్స్, కిట్‌క్యాట్ చాక్లెట్ బార్స్ విషయంలో ఈ సంస్థకు భారత్ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. రెండు నిముషాలలో తయారు చేయగలిగే ఈ మ్యాగీ న్యూడుల్స్ చాలా త్వరలో భారతీయ వినియోగదారుల మనసులు దోచుకున్నాయి. 2015 లో ఐదు నెలల పాటు పరిమితికి మించి కొన్ని పదార్థాలు వినియోగించారన్న ఆరోపణలతో నిషేదానికి గురైన మ్యాగీ త్వరలోనే తిరిగి మార్కెట్లో పుంజుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ600 కోట్లకు పైగా 70 గ్రాముల మ్యాగీ ప్యాకెట్లు అమ్ముడుపోయినట్లు కంపెనీ వెల్లడించింది. వీటిలో ఓట్స్ న్యూడుల్, వెజిటబుల్, ఎగ్, చికెన్ వంటి ప్లేవర్లలో రకరకాల మసాలాలతో విక్రయిస్తోంది. అలాగే 4200 మిలియన్ల కిట్‌క్యాట్ ఫింగర్స్ కూడా విక్రయించినట్లుగా నెస్లే తెలియజేసింది.