6 నెలల్లో లోక్సభ ఎన్నికలు – రేవంత్ రెడ్డే టీపీసీసీ చీఫ్?
తెలంగాణ: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ పదవిపై చర్చ మొదలైంది. బీసీ నేతను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అధిష్ఠానం కూడా అధ్యక్షుడిని మార్చాలని ఆలోచిస్తోంది. కానీ ఈ మార్పు ఇప్పట్లో ఉండదనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరో 6 నెలల్లో లోక్సభ ఎన్నికలున్న తరుణంలో అప్పటివరకు రేవంత్ను పీసీసీ చీఫ్గా కొనసాగించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.