Home Page SliderTelangana

సోనియా గాంధీ బంగారు తెలంగాణ కలలను నెరవేరుస్తాం

Share with

నిజాంసాగర్: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కన్న కలలు బంగారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కృషితో సాధ్యమవుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు. బుధవారం నిజాంసాగర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చౌరస్తా నుండి వేదిక వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావును సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నిధులు తీసుకువచ్చి జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ప్రజలు మెచ్చుకునే విధంగా అభివృద్ధి చేస్తానన్నారు.