Home Page SliderTelangana

ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్థరాత్రి కలకలం

Share with

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అర్థరాత్రి కలకలం రేగింది. కాగా గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి కారుతో క్యాంపస్‌లోకి చొరబడినట్లు తెలుస్తోంది.దీంతో అక్కడ ఉన్న జూనియర్ డాక్టర్లు  వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ నిందితులు జూనియర్ డాక్టర్లను పట్టించుకోకుండా క్యాంపస్‌లోకి దూసుకొచ్చారు. అంతేకాకుండా వారు తమపై దాడి చేసినట్లు జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. కాగా దాడి చేసిన వారిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి కుమార్ కూడా ఉన్నారని వారు తెలిపారు.దీంతో జూనియర్ డాక్టర్లు అసిస్టెంట్  ప్రొఫెసర్ క్రాంతి కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వారంతా విధులు బహిష్కరించి కలక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు.