Home Page SliderTelangana

విశాఖలో అర్థరాత్రి కారు బీభత్సం

Share with

విశాఖలో సిరిపురం రోడ్డులో అర్థరాత్రి ఒక ఇన్నోవా కారు బీభత్సం సృష్టించింది. రామాటాకీస్ నుండి సిరిపురం వైపుగా వెళ్తున్న కారు వీఐపీ రోడ్డులోని ఫుట్‌పాత్ ఎక్కి దగ్గరలో పార్క్ చేసి ఉన్న పలు ద్విచక్రవాహనాలను అతి వేగంగా ఢీకొడుతూ పోయి, ఒక చెట్టుపైకి దాదాపు 10 అడుగులు ఎక్కి తగిలి ఆగింది ఈ కారు. ఈ ఘటనలో ద్విచక్రవాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అనంతరం కారులోని వారు పరారయినట్లు సమాచారం.  ఈ కారును ఒక యువతి నడిపినట్లుగా పోలీసులు సీసీ టీవీలో గుర్తించారు. దగ్గరలో బార్ ఉండడంతో మద్యం  తాగిన మత్తులో యాక్సిడెంట్ జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ సమయంలో మనుష్యులు సంఘటనా స్థలంలో లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. కానీ  8 వాహనాలకు తీవ్రనష్టం జరిగింది. ఈ ఇన్నోవా కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నట్లు, వాహనం నడిపింది లేడీ డాక్టర్ అని తెలుసుకున్నారు. వారు మరో వాహనంలో పారిపోయినట్లు చూసినవారు చెప్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.