Andhra PradeshHome Page Slider

లోకేష్ పాదయాత్రలో పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవిపై భూకబ్జా ఆరోపణలు- చర్చకు రమ్మని శ్రీదేవి సవాల్

Share with

యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. చెర్లకొత్తూరులో దళితుల భూములను పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆక్రమించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. సర్వేనెంబర్లతో సహా ఆధారాలతో సభలో వినిపించారు. తనకు స్థానికులే ఆ డాక్యుమెంట్స్ ఇచ్చారని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీదేవి, ఆమె బంధువులు కలిసి ఈ దళితుల భూములను మింగేశారని లోకేష్ ఫైరయ్యారు. సభాముఖంగా శ్రీదేవికి సవాల్ విసిరారు. ఈ ఆరోపణలపై పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మండిపడ్డారు. నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోమని, లోకేష్ చూపించే సర్వేనెంబర్లు ఎప్పటినుండో దళితులకు అప్పగించాలని, అది ఎప్పటినుండో దళితుల భూమేనని ప్రకటించారు. అది గవర్నమెంట్ అసైన్డ్ భూములని, ఎమ్మార్వోతో ఎప్పటినుండో తాను దళితులకు ఇప్పించాలని ప్రయత్నిస్తున్నానన్నారు. కావాలంటే ఆ పేపర్లతో కలెక్టర్, ఎమ్మార్వోల వద్దకు వెళ్లమని, తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ ఇలాగే ఇన్నిసార్లు అధికారంలోకి వచ్చిందేమో, వారికి తెలిసినట్లు మాకు రాజకీయాలు తెలియవన్నారు.