Andhra PradeshHome Page Slider

కర్నూలులో ‘మీసం మెలేసి’ లోకేష్‌తో సవాల్ విసిరిన ఎమ్మెల్యే

Share with

కర్నూల్‌లో లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా లోకల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్,లోకేష్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. లోకేష్ తన పాదయాత్రలో వైసీపీ ఎమ్మెల్యేపై భూకబ్జా ఆరోపణలు చేశారు. వక్ఫ్ భూములు ఎమ్మెల్యే కబ్జా చేసారని ఆరోపించడంతో మండిపడ్డాడు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. దమ్ముంటే నిరూపించాలని, తనతో చర్చకు రావాలని మీసం మెలేస్తూ హెచ్చరించారు. వైసీపీ, టిడిపి శ్రేణుల మధ్య దీనితో గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఖురాన్ చేతిలో పట్టుకుని వచ్చారు హఫీజ్ ఖాన్. తాను ఖురాన్ పట్టుకుని మసీదులో ప్రమాణం చేసి మాట్లాడతానని, తనపై నిరాధారమైన ఆరోపణలు చేయవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో కర్నూల్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. రాయలసీమ రణరంగంగా మారుతోంది.