Home Page SliderTelangana

చీకటి ఒప్పందం కోసమే KTR ఢిల్లీ పర్యటన:షబ్బీర్ అలీ

Share with

తెలంగాణాలో రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. కాగా అధికార పార్టీపై ప్రతి పక్షాలు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణా మంత్రి KTR ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చీకటి ఒప్పందం కోసమే KTR ఢిల్లీ పర్యటన ఆని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ కవితను లిక్కర్ కేసు నుంచి బయటపడేసేందుకే ఈ పర్యటన అని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. తెలంగాణాలో బీఆర్ఎస్,బీజేపీ నాణేనికి బొమ్మ,బొరుసు లాంటివని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రధాని 3 సార్లు తెలంగాణా వస్తే మంత్రి KTR కనీసం పలకరించలేదు అన్నారు. అలాంటిది ఇప్పుడు మాత్రం ఢిల్లీకి డిఫెన్స్ ల్యాండ్ కోసం వెళ్లానని చెప్పడం పెద్ద బూటకమని షబ్బీర్ అలీ మండిపడ్డారు.