Home Page SliderTelangana

కేటీఆర్‌కు గర్వం ఎక్కువే

Share with

హైదరాబాద్: తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. తాను ఎన్నికల్లో గెలవ వద్దని కేసీఆర్ ప్లాన్ వేశారన్నారు. నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ గెలుస్తుందని కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. కేటీఆర్‌కు అహంకారం ఎక్కువైందన్నారు. జాబ్ క్యాలెండర్ గురించి కేటీఆర్ ఇప్పుడు హామీలా? అన్నారు. పదేళ్లలో జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నిరుద్యోగులు పడ్డ కష్టాలు మరచిపోవద్దని సంజయ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్‌ను ఓడిస్తేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు. బీజేపీ రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.