అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన కేటీఆర్
ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో మంత్రి కేటీఆర్ అసెంబ్లీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా కొత్త పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. ఎందుకంటే సమాజాన్ని సమగ్రంగా అర్థం చేసుకున్న వ్యక్తి అంబేద్కరేనని కేటీఆర్ పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల మనకు తెలంగాణా వచ్చిందన్నారు. అంబేద్కర్ మూల సిద్దాంతం ప్రజాస్వామ్యమేనని కేటిఆర్ తెలిపారు. అటువంటి మహోన్నత వ్యక్తిని గౌరవించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.