Home Page SliderTelangana

పార్టీ మారే విషయంలో క్లారిటీ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి

Share with

తాను పార్టీ మారతానని ఎప్పుడూ చెప్పలేదని కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి మీడియాతో వ్యాఖ్యానించారు. ఎందుకు ఇలాంటి కథనాలు రాసి, ప్రజలను, పార్టీని, కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీని గద్దె దించాలనే లక్ష్యంతోనే తాను బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విషయంలో మార్పు వస్తే అప్పుడు ఆలోచిస్తానన, ఇప్పుడయితే పార్టీ మారే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. కేసీఆర్‌ను అధికారంలో నుండి తొలగించడమే ప్రస్తుతానికి తన ఆలోచనన్నారు. తనపై లేనిపోని పుకార్లు పుట్టించవద్దన్నారు. ఇంటింటా బీజేపీ కార్యక్రమంలో ఈటల రాజేందర్‌తో పాటుగా రాజగోపాల్ రెడ్డి కూడా పాల్గొనకపోవడంతో, గత కొన్ని రోజులుగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం వంటి చర్యల వల్ల ఆయన పార్టీ మారతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయనకు బీజేపీలో తగిన పదవి ఇవ్వకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈసందర్బంలో శుక్రవారం ఆయనకు దిల్లీకి పిలుపు వచ్చిన సంగతి తెలిసిందే.