కోహ్లి వరల్డ్ కప్ కోసం స్పెషల్ ‘డైట్ సీక్రెట్స్’
కింగ్ కోహ్లి ఈ వరల్డ్ కప్ మ్యాచ్ల కోసం స్పెషల్ డైట్ తీసుకుంటున్నారట. ఆ సీక్రెట్స్ టీమ్ ఇండియా బస చేసిన లీలా ప్యాలెస్ హోటల్ చెఫ్ ద్వారా టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిసింది. మనం కూడా తెలుసుకుందాం. ఈ వరల్డ్ కప్లో కోహ్లి చెలరేగి ఆడుతుంటే ప్రేక్షకులు అతను ఏం తింటాడబ్బా.. ఎంత ఎనర్జీ అంటూ కామెంట్స్ చేస్తుంటారు. తన కెరీర్లోనే బెస్ట్ ఫామ్లో వచ్చి గత ఐదు మ్యాచ్లలో 354 పరుగులు చేశారు కోహ్లి. వీటిలో సెంచరీతో పాటు, 95 పరుగుల వరకూ వచ్చి కొద్దిలో మిస్ అయిన సెంచరీ కూడా ఉంది. ఇలా గంటల తరబడి క్రీజులో యాక్టివ్గా ఉండాలంటే ఏం తింటాడో తెలుసుకుందాం. కోహ్లి ప్రస్తుతం ప్రత్యేకమైన డైట్ను ఫాలో అవుతున్నారట. అదేంటంటే పూర్తిగా శాకాహారిగా మారి, కాయగూరలతో చేసిన డిమ్సుమ్ అనే చైనీస్ డిష్ తింటున్నారట. దీనితో పాటు ప్రొటీన్ కోసం మాక్ మీట్, టోపు వంటివి తింటున్నారు. ఇంకా పాల పదార్థాలు, రాగి దోశ, చిరుధాన్యాలతో చేసిన ఇడ్లీలు తింటున్నారు. ఇదే డైట్ను టీమ్ ఇండియా క్రికెటర్లందరికీ అందిస్తున్నట్లు ఆ చెఫ్ పేర్కొన్నారు.