ఖమ్మంలో కోహ్లీ భారీ పెయింటింగ్
ప్రముఖ దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన పుట్టిన రోజును కోట్ల అభిమానులు పండుగగా జరుపుకుంటారు. గత ఏడాది కోహ్లీ బర్త్ డే సందర్భంగా హైదరాబాద్లో 50 అడుగుల భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ రికార్డుల్లోకి కెక్కింది. ఇప్పటి వరకు ఏ క్రికెటర్ ఫోటోను ఇంత పెద్ద కటౌట్ను ఏర్పాటు చేయలేదు..
అయితే.. ఖమ్మంలో కోహ్లీ భారీ పెయింటింగ్ మెరిసిపోతుంది. ఇది నగరంలో ఓ బహిరంగ ప్రదేశంలో వేసిన పెయింటింగ్. పట్టణాల సుందరీకరణలో భాగంగా ఈ వాల్ పెయింటింగ్ను వేశారు. జెఎన్టియూలో ఫైన్ ఆర్ట్స్ల్లో మాస్టర్స్ చేసిన స్వాతి, విజయ్ ఈ 60 అడుగుల కింగ్ కోహ్లీ బొమ్మను వేశారు. ఇది ఇప్పుడు ఖమ్మం నగరానికి అట్రాక్షన్గా నిలుస్తోంది. దీంతో ఆ పెయింటింగ్ను కోహ్లీ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.