Home Page SliderInternational

“కోహ్లీకి హీరో అయ్యే ఛాన్స్ వచ్చింది”:మాజీ క్రికెటర్

Share with

నేడు T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా Vs సౌతాప్రికా మధ్య జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్  విరాట్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో విరాట్‌కు ధోనీలా హీరో అయ్యే ఛాన్స్ వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే 2011 వన్డే ప్రపంచ కప్‌లో ధోనీ ఫామ్‌లో లేకపోయినా  ఫైనల్‌లో 91 పరుగులు చేసి హీరోగా నిలిచారని కైఫ్ గుర్తుచేశారు. ఈ మేరకు కోహ్లీ గత మ్యాచులను మరిచిపోయి ఇవాళ చివరి వరకు బాగా ఆడితే హీరో అయ్యే ఛాన్స్ ఉందని కైఫ్ తెలిపారు. కాగా 2023 వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లీ సౌతాఫ్రికాపై సెంచరీ చేశారన్నారు. అయితే ఇప్పడు కూడా విరాట్ కోహ్లీ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాలని మహ్మద్ కైఫ్ ఆకాక్షించారు.