IPL చరిత్రలోనే అరుదైన రికార్డు సృష్టించిన కోహ్లీ
ఈ IPL సీజన్లో RCB స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. కాగా ఆయన IPLలో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.ఇప్పటికే క్రికెట్లో రికార్డుల పుట్టగా పేరు సంపాదించిన కోహ్లీ మరోసారి అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఈ రోజు పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో అర్థశతకంతో కోహ్లీ అదరగొట్టాడు. అయితే ఈ మ్యాచ్లో 30 పరుగులు పూర్తి చేయడంతో IPLలో వందసార్లు 30+ పరుగులు చేసిన తొలి ప్లేయర్గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ..కోహ్లీ రికార్డును ట్వీట్ చేస్తూ..”ది గోట్” అని పోస్టులు చేస్తున్నారు. అంతేకాకుండా IPLలో 600 ఫోర్లు కొట్టిన రెండో ప్లేయర్గా కొహ్లీ నిలిచాడు. కాగా మొదటి స్థానాన్ని 730 ఫోర్లు కొట్టిన శిఖర్ ధావన్ సొంతం చేసుకున్నారు.