Home Page SliderNational

ఢిల్లీలో కిరణ్ కుమార్ రెడ్డి  వరుస భేటీలు

Share with

ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తాజాగా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ,పార్టీ జాతీయ సంఘటనా ప్రధాన కార్యదర్శి సంతోష్ గారిని పార్టీ నేత విష్ణు వర్ధన్ రెడ్డితో కలిసి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో దేశంలోని తాజా రాజకీయాలపై ఆయన అమిత్ షాతో ముచ్చటించారు. అనంతరం  తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాజకీయా ల పై చర్చించినట్లు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో పనిచేసే అంశాల మీద అమిత్ షా , బీ ఎల్ సంతోష్ జీ కిరణ్ కుమార్ రెడ్డితో చర్చించినట్లు సమాచారం. అయితే ఆయన నిన్న పార్టీ అధ్యక్షుడు జే పీ నడ్డాతో కూడా భేటీ అయ్యారు. కాగా జేపి నడ్డా నివాసంలోనే మాజీ సియం కిరణ్ కుమార్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి అమిత్ షా ను కలిశారు.