Home Page SliderNational

భారతదేశంలో ఒకే ఒక్కడు కింగ్ కోహ్లీ

Share with

టీమ్‌ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మైదానంలోనే కాదు..సోషల్ మీడియాలోను రికార్డు సృష్టించారు. ఆయన తాజాగా అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. అదేంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ 250 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్నారు. దీంతో ఆయన భారతదేశంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక  ఫాలోవర్లు కలిగిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫోలోవర్లు కలిగి ఉన్న క్రీడాకారుల్లో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నారు. కాగా కోహ్లీ కన్నా ముందు స్థానంలో ఫుట్‌బాల్ ప్లేయర్స్ రొనాల్డో,మెస్సీ ఉన్నారు. క్రికెట్ మైదానంలో చురుగ్గా ఉండే విరాట్ కోహ్లీ సామాజిక మాధ్యమాల్లో కూడా తన సత్తా చాటాడు. దీంతో విరాట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో “కోహ్లీ ది కింగ్” అని కామెంట్స్ చేస్తున్నారు.