Home Page SliderNational

మోస్ట్ పాపులర్ ప్లేయర్‌గా కింగ్ కోహ్లీ

Share with

“కింగ్ ఎప్పుడూ కింగే” ఈ పదం టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి బాగా నప్పుతుందనే చెప్పాలి. ఎందుకంటే కింగ్ కోహ్లీ ఈ మధ్య కాలంలో జరిగిన IPL,WTC ఫైనల్ మ్యాచ్‌లో బాగానే రాణించినప్పటికీ ట్రోఫీలను మాత్రం టీమిండియా దక్కించుకోలేకపోయింది. అయినప్పటికీ కింగ్ కోహ్లీ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. కాగా  తన ఆటతో విరాట్ కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్లమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఆయనకు సోషల్ మీడియాలో మరి ఏ ప్లేయర్‌కి లేనివిధంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ ఏడాది జరిగిన IPL-2023లో కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఓటమి పాలయ్యింది. అయితే ఈ IPL లీగ్ సమయంలో నెట్టింట కోహ్లీ ఆటపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాగా ఈ IPL టోర్నీ మొత్తంలో ఏకంగా 70లక్షల సార్లు విరాట్ కోహ్లీ పేరును ప్రస్తావించినట్లు క్రికెట్ వర్గాలు తాజాగా వెల్లడించాయి. దీంతో భారతదేశంలో మోస్ట్ పాపులర్ ప్లేయర్‌గా కోహ్లీ నిలిచినట్లు క్రికెట్ వర్గాలు ప్రకటించాయి. ఇది చూసిన కోహ్లీ ఫ్యాన్స్ విరాట్ కోహ్లీ ఎప్పటికీ కింగే అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.