Home Page SliderNational

8 పెళ్లిళ్లు చేసుకున్న కిలాడీ లేడీ

Share with

 దక్షిణాది రాష్ట్రాల మగవారిని పెళ్లి పేరుతో మోసం చేసి, నగలు, డబ్బులతో ఉడాయించిన కిలాడీ లేడీ రషీద వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తమిళనాడు సేలం జిల్లాలోని తారమంగళానికి చెందిన ఒక ఫైనాన్షియర్ మూర్తి అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంటు ద్వారా ఈమె బండారం బయటపడింది. మూర్తికి ఇన్‌స్టాలో పరిచయమైన రషీదను ప్రేమించి,ఈ ఏడాది మార్చిలో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి మధ్యా పెళ్లి జరిగిన నాటి నుండి గొడవలే. అయితే జూలై 4న ఆమె ఇంట్లోని 1.5 లక్షల నగదు, 5 సవర్ల బంగారు నగలతో పారిపోయింది. దీనితో మూర్తి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కూపీ లాగగా ఆమె కథంతా తెలిసింది. నీలగిరి జిల్లా గూడలూర్‌కు చెందిన ఈమె సోషల్ మీడియాలలో నకిలీ ఖాతాల ద్వారా డబ్బున్న మగవారిని ఆకర్షించి, పరిచయం చేసుకుంటుందని తెలుసుకున్నారు. అనంతరం వివాహం చేసుకుని, కొన్ని రోజుల తర్వాత ఇంటిలోని, డబ్బు, నగలతో పారిపోతుందని తెలుసుకున్నారు. ఇలా ఇప్పటి వరకూ తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 8 మందిని వివాహాలు చేసుకుందని తెలిసింది. పోలీసులు రషీద కోసం గాలిస్తున్నారు.