Home Page SliderTelangana

జీఎస్టీ అధికారుల కిడ్నాప్ కేసు సుఖాంతం

Share with

సరూర్ నగర్‌లో జీఎస్టీ అధికారులు మణిశర్మ, ఆనంద్‌లను  కిడ్నాప్ కేసు సుఖాంతమయ్యింది. వారిని కిడ్నాప్ చేసి 5 లక్షలు డిమాండ్ చేసిన ముజీబ్, ఇంతియాజ్, ముశీర్, ఫిరోజ్ అనే కిడ్నాపర్ల ఆట కట్టించారు పోలీసులు. వెల్డింగ్ షాపు నామమాత్రానికి ఓపెన్ చేసి, ఏ వ్యాపారమూ జరగడం లేదని గుర్తించిన జీఎస్టీ అధికారులు షాపును సీజ్ చేయడానికి వెళ్తే వారినే కిడ్నాప్ చేశారు ఈ దుండగులు. అంతేకాక వారి సీనియర్ ఆఫీసర్లకు ఫోన్ చేసి, 5 లక్షలు ఇస్తేనే వారిని వదులుతామన్నారు. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ చాలా సీరియస్ అయ్యారు. సంబంధిత అధికారులతో మాట్లాడి విషయం తెలుసుకోమని ఆదేశాలు జారీచేశారు. విషయం కేంద్రం దృష్టికి వెళ్లడంతో అలెర్టయిన పోలీసులు సిటీ మొత్తం జల్లెడపట్టి, సీసీ ఫుటేజ్ సహాయంతో వారిని కనిపెట్టి అరెస్టు చేశారు.