Andhra PradeshHome Page Slider

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Share with

ఏపీ ప్రభుత్వం పట్టాదారు పాసు పుస్తకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.కాగా గత ప్రభుత్వ హయాంలో జగన్ ఫోటోతో  ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటివరకు పంపిణీ చేసిన 20.19 లక్షల భూహక్కు పత్రాలు,పంచాల్సిన మరో లక్ష పత్రాలను అధికారులు నిలిపివేశారు. దీనిపై మంత్రి సత్య ప్రసాద్ అధికారులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం అందరికీ కలిపి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. కాగా ఇకపై ఇచ్చే పాస్ పుస్తకాలను రాజముద్రతో డిజైన్ చేసి,సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపిన తర్వాత వాటిని ప్రజలకు అందించనున్నారు.