NationalNews Alert

గుజరాత్ ఆటో డ్రైవర్ ఇంట కేజ్రీవాల్ పొలిటికల్ మీల్స్

Share with

గుజరాత్ పర్యటనలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఓ వింత సంఘటన ఎదురయ్యింది. సోమవారం ఆటో డ్రైవర్ల కార్యక్రమంలో విక్రమ్ దంతానీ అనే డ్రైవర్ కేజ్రీవాల్‌ను తన ఇంటికి ఆహ్వానించారు. తన ఇంట్లో భోజనం చేయమని కోరాడు. వెంటనే అంగీకరించిన కేజ్రీవాల్ అతని ఆటోలోనే రాత్రి హోటల్ నుండి అతని ఇంటికి బయలుదేరాడు. అయితే ఇక్కడ ఓ హైడ్రామా నడిచింది. కేజ్రీవాల్ ప్రయాణిస్తున్న ఆటోను సెక్యూరిటీ కారణాల వల్ల అహ్మదాబాద్ పోలీసులు అడ్డుకున్నారు. ఆ టైంలో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. చివరకు ఓ కానిస్టేబుల్ ఆటో డ్రైవర్ పక్కన కూర్చోగా, రెండు పోలీస్ వాహనాలు ఆ ఆటోను విక్రమ్ ఉన్న ఇల్లు వరకూ అనుసరించాయి. అయితే ఇదంతా నాటకమంటూ, కేజ్రీవాల్ గొప్ప నటుడని గుజరాత్ మంత్రి హర్ష సంఘ్వీ ఎద్దేవా చేశారు.