Telangana

హామీలు నెరవేర్చని కేసీఆర్ త్వరలో ఇంటికే

Share with

హామీలు నెరవేర్చని సీఎం కేసీఆర్‌ను త్వరలో రాష్ట్ర ప్రజలు ఇంటికి పంపనున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లి మండలం ఎస్‌.డబ్ల్యూ.లింగోటం, వడ్డెపల్లి, చిట్టంపహడ్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఫ్లోరోసిస్‌ను రూపుమాపామని చెబుతున్న కేసీఆర్‌ పరిశోధన కేంద్రం ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గంలో గొల్ల, కురుమలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే తాను ఎన్నికల సంఘానికి లేఖ రాసి అడ్డుకున్నానని ప్రచారం చేయడం నీచరాజకీయమని చెప్పారు. దీనిపై స్థానికంగా ప్రసిద్ధి చెందిన చలిదోన లక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో తాను కుటుంబసమేతంగా ప్రమాణం చేయడానికి సిద్ధమన్నారు. ముఖ్యమంత్రి సైతం తన కుటుంబంతో ఆలయానికి వచ్చి ప్రమాణం చేసి నిజాయతీని నిరూపించుకోవాలని సవాల్‌ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వని కేసీఆర్‌కు యువత ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయొద్దన్నారు. కమ్యూనిస్టు కార్యకర్త నిజాయతీపరులేనని, నాయకత్వమే వారిని తప్పుదోవ పట్టిస్తోందని చెప్పారు