Home Page SliderTelangana

KCR ప్రజల్లోకి తొందరలోనే వస్తారన్న కొత్త ప్రభాకర్ రెడ్డి

Share with

దుబ్బాక: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడుతోందని, త్వరలోనే ప్రజల్లోకి వస్తారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం యశోద ఆసుపత్రిలో కేసీఆర్‌ను ఎమ్మెల్యే పరామర్శించారు. అలాగే ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్‌రావులు కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రభాకర్ మాట్లాడుతూ.. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో తొందరగానే కేసీఆర్ రికవర్ అయి మామూలుగా మళ్లీ మన మధ్యలోకి వస్తారని అన్నారు.