NewsTelangana

కేసీఆర్ పేదోళ్లను గొప్పోళ్లుగా చేస్తున్నారు

Share with

మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ మంత్రులు, ముఖ్యనేతలంతా హాజరయ్యారు. ఓ కాంట్రాక్టర్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మద్య జరుగుతున్న ఎన్నికన్నారు. మునుగోడును గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణాలో కేసీఆర్ పేదల పెన్షన్ రూ.200 నుంచి రూ.2016 రూపాయలకు పెంచారన్నారు.  ఈ విధంగా కేసీఆర్ రాష్ట్రంలోని పేదోళ్లను గొప్పోళ్లుగా చేస్తున్నారన్నారు. కానీ మోదీ మాత్రం రాజగోపాల్‌రెడ్డి ఆస్తుల్ని పెంచారన్నారు. మోదీయేమో పెద్దోళ్లకే మరింత దోచి పెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. గతంలో ఈ మునుగోడులో మంచినీటికి ఎంత కష్టముండేదో కేసీఆర్‌కే తెలుసన్నారు.  ఈ కష్టాన్ని పారద్రోలడానికే తెలంగాణాలో మిషన్ భగీరథను ప్రారంభించామన్నారు. తెలంగాణాలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టారన్నారు. తెలంగాణా వచ్చాక మంచినీటి గోస తీరుస్తాన్నమాటను ఆయన నిలబెట్టుకున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు.