NationalNews

ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్‌ను పరిశీలించిన కేసీఆర్

Share with

తెలంగాణా సీఎం కేసీఆర్ ఈ రోజు ఢిల్లీలో పర్యటించారు. అయితే సీఎం కేసీఆర్ ఇటీవల టీఆర్‌ఎస్ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చిన విషయం తెలిసిందే.  ఈ మేరకు ఆయన ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ  కార్యాలయాన్ని పరిశీలించారు. ఢిల్లీలోని వసంత్ విహార్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణంలో ఉంది. సీఎం కేసీఆర్ ఏడాదిలోగా ఈ నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్పీ మార్గ్‌లో తాత్కాలికంగా బీఆర్‌ఎస్  పార్టీ కార్యాలయాన్ని పార్టీ నేతలు సిద్ధం చేశారు. ఇక్కడ్నుంచే జాతీయ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించాలన్నదానిపై కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది.