Home Page SliderTelangana

తెలంగాణాలో కాంగ్రెస్ ఇచ్చిన భూములను కేసీఆర్ లాక్కున్నారు: భట్టి

Share with

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. కాగా కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కార్యక్రమాల గురించి కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ..కేసీఆర్ హాయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు లేవన్నారు. మరోవైపు నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు రాలేదని భట్టి విమర్శించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణాలోని పేద ప్రజలకు కాంగ్రెస్ హాయాంలో ఇచ్చిన భూములను కేసీఆర్ ధరణి ద్వారా లాక్కున్నారన్నారు. అంతేకాకుండా తెలంగాణాలో చేప పిల్లల పంపిణీలో భారీ అవినీతి జరుగుతోందని భట్టి ఆరోపించారు. బీఆర్ఎస్ హాయాంలో తెలంగాణాలోని సింగరేణి కాలరీస్ కూడా ప్రైవేట్ పరం అవుతున్నాయని భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్‌ను దుయ్యబట్టారు.