యువత ఉద్యోగాలపై కేసీఆర్కు ఏమీ ఇసుమంతైనా పట్టదు
సంగారెడ్డి: తెలంగాణలో యువత ఉద్యోగాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్కు చింత లేదని, ఆయన కుమారుడు కేటీఆర్ను సీఎం చేయడం పైనే ధ్యాస ఉందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా విమర్శించారు. కొడుకుని సీఎం చేయడం పైనే ధ్యాస. వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన వ్యక్తి కేసీఆర్ అని ఆరోపించారు. శనివారం కొల్లాపూర్, పటాన్చెరు బహిరంగ సభల్లో, మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్లో, ఖైరతాబాద్ నియోజకవర్గం రోడ్ షోలలో అమిత్షా పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రశ్నాపత్రాల లీకేజీ దోషులను జైల్లో పెట్టి తీరతాం. రెండున్నర లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. మా పార్టీకి ఓటువేస్తే కేసీఆర్ స్థానంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి, ప్రజలారా మీ ఓటు బీజేపీకి వేసి బీసీ ముఖ్యమంత్రిని పీఠంపై నిలబెట్టండి.