లిక్కర్ స్కాం, పేపర్ లీక్ నుండి కేసీఆర్ తప్పించుకోలేరు- ఈటల
బండి సంజయ్ అరెస్టు విషయంలో కేసీఆర్ తీరుపై బీజేపీ సీనియర్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శనాస్త్రాలు సంధించారు. హిందీ పేపర్ లీకేజీ పేరు చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి అరెస్టు చేయడాన్నితీవ్రంగా ఖండిస్తున్నానని, ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణాలో జరుగుతున్న స్కాంలు, లీకేజిల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తున్నారన్నారు. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందన్నారు.
![](https://www.manasarkar.com/wp-content/uploads/2023/04/image-39-1024x614.png)
‘అటుకులు బుక్కిన కెసిఆర్ వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు’. దేశం అంతా డబ్బులు ఖర్చు పెడతా అని కెసిఆర్ మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఎంతగా తెలంగాణ ప్రజలను కొల్లగొట్టారు అర్థం చేసుకోవచ్చన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ప్రతిపక్ష పార్టీల్లో నాయకులు లేకుండా చేస్తున్నారు. నిరుద్యోగుల తరపున మేము పోరాటం చేస్తాం. బీజేపీ ప్రజల పక్షాన ఉందని, TSPSC ని రద్దు చేయించేదాకా నిద్రపోమన్నారు. కెసిఆర్ రాజ్యం, ప్రభుత్వం శాశ్వతం కాదు. కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. ఉపఎన్నికలు జరిగితే వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. రేపటి దేశ భవిష్యత్తు పిల్లలు కాబట్టి మోడీ అనేక సంవత్సరాల నుండి ‘మన్కీబాత్’ పేరుతో విద్యార్థుల్లో మనోధైర్యం నింపడానికి స్వయంగా వారితో నేరుగా మాట్లాడుతున్నారు. బీజేపీ ఎప్పుడూ పిల్లల చదువులు, యువత ఉద్యోగాల కోసమే ఆలోచిస్తుందన్నారు.