Home Page SliderTelangana

కవిత 100 రోజులుగా తీహార్ జైల్లోనే..

Share with

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 100 రోజులుగా తీహార్ జైల్లో ఉంటున్నారు. మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. ఆ మరుసటి రోజు రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీలోకి తీసుకుంది. కవితను బెయిల్ కోసం ఆమె తరఫు లాయర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. ఈడీ, సీబీఐ ఎప్పటికప్పుడు కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పిస్తోంది. ఇక పలుమార్లు బెయిల్ పిటిషన్‌లపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.