Home Page SliderTelangana

కాంగ్రెస్‌ను నమ్మి కర్ణాటక నష్టపోయింది ఇక తెలంగాణ వంతు: యడియూరప్ప

Share with

హైదరాబాద్: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన 5 గ్యారంటీలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. కర్ణాటక ప్రజలను మోసం చేసిన సిద్ధరామయ్య ప్రభుత్వం దివాలా ధోరణిలో నడుస్తోందని ఆరోపించారు. తెలంగాణాలోనూ ఆరు గ్యారంటీ పథకాలు అంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని అన్నారు. వాటిని నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోవద్దని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే తప్పకుండా బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఆ మాటకు బీజేపీ పార్టీ కట్టుబడి ఉంటుందని యడియూరప్ప స్పష్టం చేశారు.